అందరూ పాపం చేశారు!

దేవుడు మానవుణ్ణి చేశాడు ...

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆది. 1:1.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
దేవుని స్వరూపమందు వాని సృజించెను.
స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను.

ఆదియందు దేవుడే భూమిని, ఆకాశాన్ని కలుగజేశాడు. మానవుని తన స్వంత పోలికలో చేశాడు. అంతకు ముందే గ్రహాలను, వృక్షాలను చేపలను, పక్షులను, సమస్త భూజంతువులను సృష్టించాడు కాని మానవుణ్ణి మాత్రమే తన స్వంత పోలికతో చేశాడు.


మానవుడు జీవాత్మ ...

దేవుడైన యెహోవా నేలమంతితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ఆది. 2:7.

దేవుని సృష్టి అంతటిలో మానవుడు ఎంతో శ్రేష్టుడు. మానవునిలో తన జీవవాయువును ఊదాడు. జంతువులకంటే భిన్నంగా దేవుడు మానవుని చేశాడు. అతడు భౌతిక శరీరం మాత్రమే కాదు జీవాత్మను కలిగి ఉన్నాడు.

దేవుని ఆజ్ఞ ...

మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను. ఆది. 2:9.


మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.
మరియు దేవుడైన యెహోవా
- ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
ఆది. 2:15-17.

దేవుడు ఏదెను వనములో పలురకాల వృక్షాలతో ఒక తోటను నాటాడు. ఆ యొక్క తోటమధ్యలో రెండు ప్రాముఖ్యమైన వృక్షాలున్నాయి. ఒకటి జీవవృక్షము రెండవది మంచిచెడ్డలతెలివినిచ్చు వృక్షము. దేవుడు ఆ అందమైన చెట్లకున్న ప్రతిఫలాన్ని నీవు నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పాడు. అయితే ఈ రెండు ప్రాముఖ్యమైన చెట్లలో ఒకటైన మంచిచెడ్డలతెలినిచ్చు వృక్షఫలాన్ని నీవు “తినకూడదు!” అని చెప్పాడు. దేవుడు ఆ చెట్టుఫలాన్ని నిషేధించటం మాత్రమే కాదు. దానిని తిను దినమున నీవు తప్పక మరడిస్తావు అని చెప్పాడు.


మానవుడు దేవునికి అవిధేయుడయ్యాడు...

స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తినెను, మరియు తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
ఆది 3:6.

ఆ పండుయొక్క రమ్యమైన ఆకారాన్ని చూచినప్పుడు అది నిజంగా జ్ఞానాన్నిస్తుందని నమ్మకం కలిగింది, సర్పముచేత ప్రేరేపించబడి, మోసగించబడిన తర్వాత అమె ఆ పండును తిన్నది. అప్పుడు ఆమె తిని కొన్నింటిని తన భర్తకు యిచ్చింది అతడు కూడా తిన్నాడు.
కాని గుర్తుంచుకోండి, దేవుడు చెప్పాడు...

“ఆ వృక్షఫలము తినుదినమున” - “నిశ్చయముగా చచ్చెదవు”
ఆది 2:17.

ఆదాము తిన్నాడు - కానీ మరణించాడా ?
లేఖనమేమి చెబుతోంది ?
రోమా. 4:3.a


అతడు మరణించాడా?

అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను;
వారు తాము దిగంబరులమని తెలుసుకొని
అంజూరపు ఆకులు కుట్టి
తమకు కచ్చడములను చేసుకొనిరి. ఆది. 3:7.

వారు చనిపోయారా? వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు అంజూరపు ఆకులను కుట్టి బట్టలుగా ధరించారు. భౌతికంగా వారు జీవించి క్షేమంగానే ఉన్నారు. ఆదాము హవ్వలు శారీరకంగా మరణించలేదని మనకు అర్థమవుతోంది.
దేవుడు స్పష్టంగా చెప్పాడు.

“నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు
ఆది 2:17.

మానవుని ఆధ్యాత్మిక మరణము

చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమునువిని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి - నీవు ఎక్కడ ఉన్నావనెను?


అందుకతడు తోటలో నీ స్వరము విన్నప్పుడు
దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినయెను.
ఆది 3:8-10.

దయచేసి గమనించండి. వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులు కాకముందు ఎలావున్నారో వాక్యం స్పష్టంగా చెబుతోంది. ఆది. 2:25.

“అప్పుడు ఆదామును అతని భార్యయు దిగంబరులుగా ఉండిరి.
అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి”.

ఇప్పుడు, వారు నిషేధింపబడిన ఫలాన్ని తిన్న తర్వాత వారిరువురు తాము దిగంబరులమని గ్రహించి కచ్చడాలు చేసుకుని దేవుని సన్నిధినుండి దాగుకొన్నారు. దేవుని పిలుపు విన్నప్పుడు ఆదాము హవ్వలు భయపడ్డారు. వారిలో బచ్చితంగా సంభవించిన ఆ మార్పు కేవలం భౌతికమైనది కాదు, అంతరంగంలోనిది. అవును, వారు లోపల చనిపోయారు. దేవుడు చెప్పినట్లుగా వారు చనిపోయారు. అయితే అది శరీరమరణం కాదుగాని ఆత్మీయ మరణం. (ఎఫెసీ 2:5, కొలస్సీ 2:13).


బైబిలు మరోచోట ఇలా చెబుతోంది.
మీరు ..... చచ్చినవారై యుండగా .... ఎఫెసీ 2:1.
మీరు ...... మృతులై యుండగా ...... కొలస్సీ 2:13.

ఆదాము కుమారుని సంగతేమిటి ?

ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి
తన పోలికెగా తన స్వరూపమున
కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.
ఆది. 5:3.

ఆదాము తన కుమారుని కన్నాడు. అయితే ఆ బిడ్డ తన తండ్రియైన ఆదాము రూప రేఖల్లోనే పుట్టాడని వ్రాయబడింది.

ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. షేతు తన తండ్రియైన ఆదాము స్వరూపమందు ఆదాము పోలికలో ఆధ్యాత్మిక మరణంతో జన్మించాడు. కాబట్టి షేతు పుట్టుకతోనే ఆధ్యాత్మికంగా మరణించియున్నాడు.


ఇదే సత్యం మానవులందరికి వర్తిస్తుంది.

ఏమి జరిగిందో పూర్తిగా అర్థంచేసుకోవాలంటే మనం రోమా 5:12 చూదాలి.

ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును
పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో,
అలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున
మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
రోమా 5:12.

ఆదామను ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములో ప్రవేశించింది. దాని ఫలితం ఆధ్యాత్మిక మరణం, ఈ ఆధ్యాత్మిక మరణం మానవులందరికి సంప్రాప్తించింది. ఆదాము సంతతియైన ప్రతీ మానవుడు ఆధ్యాత్మిక మరణంతోనే ఈ లోకంలో పుడుతున్నాడు.

నీక్కూడా ఇదే సత్యం వర్తిస్తుంది.

ఆదాము దేవునికి వ్యతిరేకి అయినందున అతని సంతానసంబంధులందరికి ఏం జరిగిందో ఈ క్రింది మూడు వచనాలు తెలియజేస్తున్నాయి.

అయితే అపరాధము కలిగినట్టు
కృపావరము కలుగలేదు.
ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు
చనిపోయినయెడల

మరి యెక్కువగా దేవుని కృపయు,
యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన
దానమును,


అనేకులకు విస్తరించెను. రోమా 5:15.
కాబట్టి తీర్పు ఒక్క అపరాధములమునవచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి
కలుగుటకు ఏలాగు కారణమాయెనో
, అలాగే ఒక్క పుణ్య కార్యమువలన
కృపాదానము
మనుష్యులకందరికిని జీవప్రదమైన
నీతి విధింపబడుటకు కారణమాయెను. రోమా 5:18.
ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు
పాపులుగా
ఏలాగు చేయబడిరో
, అలాగే ఒకని విధేయతవలన అనేకులు
నీతిమంతులుగా
చేయబడుదురు. రోమా 5:19.

ఆదాము శరీర సంబంధులందరు ఆధ్యాత్మికంగా మృతులు మాత్రమే కాదు, వారు శిక్ష విధించబడి లేఖనాలలో దేవుని చేత పాపులు అని పిలువబడుతున్నారు. దయచేసి గమనించండి. ఈ పరిస్థితి ఒకని అవిధేయత ద్వారా మాత్రమే కలుగలేదు. లేఖనము ఈ రీతిగా సెలవిస్తుంది.

ఒక వ్యక్తి అపరాధం ద్వారా      అందరూ మరణించారు.
ఒక వ్యక్తి అపరాధం వల్ల       అందరికి శిక్ష విధించబడింది.
ఒక వ్యక్తి అవిధేయతవల్ల      అందరూ పాపులయ్యారు.

ఆదాముతో మనకున్న సంబంధం మనలను ఆధ్యాత్మికంగా మృతులను చేస్తే...
ఆదాముతో మనకున్న సంబంధం మనకు శిక్షా విధికి కారణమైతే ...
ఆదాముతో మనకున్న సంబంధం మనలను పాపులుగా చేసింది.
మనకు ఆదాముతో ఈ సంబంధం ఎలా ఏర్పడింది?


సమాధానం మన పుట్టుకతోనే

నేను పాపములో పుట్టినవాడను పాపములోనే
నా తల్లి నన్ను గర్భము ధరించెను
.
కీర్తన 51:5.

మనం తల్లి గర్భములో పడ్డప్పుడే ఆదాముతో మనకు బాంధవ్యం ఏర్పడింది. మనకు రెండు కళ్ళు, ఒక ముక్కు లేఖనానుసారంగా -- మృతమైన ఆత్మ, మనందరికీ ఇవే ఉన్నాయి. మనం తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మానవ జాతిలో లెక్కించబడిన మరుక్షణంలోనే నీవు ఆదాము సంబంధివి,

మరణంతో, శిక్షావిధితో, ఉన్న పాపివి.

ఇలాగు వ్రాయబడి ఉంది.

ఆదాము సంబంధిగా పుట్టిన, భౌతిక మానవుని స్థితిని గురించి దేవుడీవిధంగా చెబుతున్నాడు.

వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని
యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.
వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు
మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు.
కీర్తన 14:2-3.

పాపము చేయక మేలు చేయుచుండు
నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు.
ప్రసంగి 7:20.

మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి...
యెషయా 53:6.


మేమందరము అపవిత్రులవంటివారమైతిమి
మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను
మేమందరము ఆకువలె వాడిపోతిమి
గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును
కొట్టుకొనిపోయెను.
యెషయా 64:6.

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా - నీతిమంతుడు లేడు,
ఒక్కడును లేడు
గ్రహించువాడెవడును లేడు.
దేవుని వెదకువాడెవడునులేడు.
అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.
మేలుచేయువాడు లేదు, ఒక్కడైనను లేడు.
రోమా 3:10-12.

మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుశక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవాగ్రతకు పాత్రులమైయుంటిమి.


మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు
సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను
క్రీస్తుతోకూడ బ్రతికించెను.
ఎఫెసీ 2:2,3,5,

మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక
యుండుటవలనను, మీరు మృతులై యుండగా,
కొలస్సీ 2:13.

అందరూ పాపం చేశారు...

ముగింపు, ఒక మనుష్యుని ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం మానవులందరికి సంప్రాప్తమైంది.

ఈ కారణం చేత మానవజాతి యావత్తు

  • ఆధ్యాత్మికంగా మరణించింది
  • శిక్షావిధిలో ఉంది
  • పాపులయ్యారు

కాబట్టి మనకు రక్షకుడు అవసరమైయున్నాడు!


సంబంధిత వ్యాసాలు


Know the Truth